October

వైఎస్ జగన్ దీక్ష భగ్నం..

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు.

భ్రమరావతి - ప్రైవేటు చంద్రహారతి!

రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ ఉత్సవం నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్‌ భవితవ్యానికి బంగారు బాట అని శత విధాల ప్రచారం చేస్తున్నది. అనుకూల మీడియా కూడా అదే తరహాలో ఆకాశానికెత్తి చూపిస్తున్నది. రాజధానిగా అమరావతి ఎంపికను గాని, అక్కడ నిర్మాణం ప్రారంభిం చడాన్ని గాని వ్యతిరేకిస్తున్నవారె వరూ లేరు. కాకపోతే శ్రుతిమించిన హంగామాపై వ్యా ఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగు ప్రారంభం ఆర్భాటాన్ని బట్టి పైసలు రావు. అలాగే తమ కృషిని బ్రహ్మాండంగా చూపించుకోవాలనే తాపత్రయంలో మోయ లేని ఖర్చును మీద వేసుకోవడం అవసరమా?

పేదలంటే ప్రభుత్వానికి అలుసెందుకు?

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 లక్షల ఎకరాలతో భూమి బ్యాంకునే ఏర్పాటు చేసి పారిశ్రామిక వృద్ధికి వినియోగించాలని చెబుతున్నది ఈ భూ సేకరణకు ప్రభుత్వం ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వల్ల రాజ్యాంగ లక్ష్యమైన పేదరిక నిర్మూలన దెబ్బతింటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భూమి పంపకం జరగకుండా పేదరిక నిర్మూలన జరగడం కల్ల అని చెప్పారు. మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలు, అతివాద ఉద్యమాలు భూపంకం ఎజెండాను ముందుకు తెచ్చాయి. అందువల్లనే 1955 ఎఐసిసి ఆవడిలో భూ సంస్కరణలు తెస్తామని తీర్మానం చేయవలసి వచ్చినది.

సిలిగురి సంకేతం..

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సుశాంత రంజన్‌ ఉపాధ్యాయ చేసిన రాజీనామా ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ దురహంకారాన్ని కళ్లకు కట్టింది. సుశాంత్‌ రంజన్‌ రాజీనామాచేస్తూ 'ఒక రాజకీయ పార్టీకి ఇది తగని పని. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరాదు' అంటూ మమత పార్టీపై చేసిన ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేట్‌ దిగ్గజాలు, మత ఛాందసులు, మావోయిస్టుల అండదండలతో 'పరివర్తన్‌' పేరిట 2011లో కొల్‌కతా గద్దెనెక్కినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అరచాక దాడులకు బెంగాల్‌ ఆలవాలమైంది.

అడిగితే తప్పా?

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం.

మావోయిస్టుల డెడ్ లైన్..

కిడ్నాప్‌ చేసిన ముగ్గురు గిరిజన నాయకుల విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు మరో 36 గంటల్లో ముగియనున్నా.. ఇంతవరకూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. దీంతో కిడ్నా్‌పకు గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. సోమవారం విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాక్సైట్‌ తవ్వకాల అంశంపై ప్రభుత్వ వైఖరిని 13వ తేదీలోగా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేయగా, ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం.

బీఫ్‌ ఎగుమతుల్లో బిజెపి వాటా..

లక్నో: గోమాంస భక్షణకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే సంగీత్‌సింగ్‌సామ్‌కు మాంసం ఎగుమతుల సంస్థలో వాటా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. మీరట్‌ జిల్లాలోని సర్ధానా నియోజకవర్గం నుంచి 2012లో బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగీత్‌కు అల్‌-దువా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో వాటా ఉన్నది వాస్తవమేనని స్పష్టమైంది ఈ కంపెనీ బర్రె-దున్నపోతు, మేక,గొర్రె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌ నుంచి హలాల్‌ మాంసాన్ని అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రముఖ కంపెనీగా దీనికి పేరుంది.

అప్పుల్లో వుంటే ఆర్భాటాలా?:మధు

రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌పై ఉన్న యావ ప్రజల సమస్యలపై లేదన్నారు. రాజధాని శంకుస్థాపన ఆర్భాటానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిం చడం అవసరమా అని ప్రశ్నిం చారు. శంకుస్థాపనకే రూ.400 కోట్లు, అతిథి మర్యాదలకు రూ.2.5కోట్లు, వేదికపై యాంకర్లకు రూ.10 కోట్లు కేటాయించారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో.. ఈ ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు.

అమరావతి పనులు ఆపండి:NGT

పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్‌... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దాద్రీ ఘటనపై SFI ఆగ్రహం..

దాద్రీ ఘటనపై దేశ రాజధానిలోని విద్యార్థిలోకం కదం తొక్కింది. జెఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు మార్చ్‌ నిర్వహించాయి. ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఫిరోజ్‌ షా రోడ్‌ కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాద్రీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఘటన వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

Pages

Subscribe to RSS - October