October

ప్రైవేటు రిజర్వేషన్లకై పోరాటం..

ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. ' ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం ' అనే అంశంపై కెవిపిఎస్‌ ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహిం చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అగ్రవర్ణ కులాల పెత్తందార్లు తామూ పేదలమేనని, తమకూ రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే ఉన్న రిజర్వేషన్లను తొలగించాలని విష పూరిత ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని పనులను నిలిపివేయండి:NGT

పర్యావరణ అనుమతులు లేని కారణంగా రాజధాని పనులను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తోటలను కూల్చివేయడం, పొలాలను చదును చేయడం, శంకుస్థాపన పేరిట తాత్కాలిక నిర్మాణా లను చేపట్టడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం పట్ల పర్యావరణ వేత్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారుపై ధిక్కార కేసును దాఖలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశలో అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు.

విద్యపై నిర్లక్ష్యం:MLCశర్మ

విజయవాడ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చిన ప్రాథమిక విద్యనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య కోసం అదనంగా రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ( ఎన్‌సిఇఆర్‌టి ) చెప్పినా, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తితో కాకుండా, వ్యాపార దృష్టితో విద్యను అందిస్తోందన్నారు.

బీజింగ్‌కు వెళ్లనున్న ఏచూరి..

బీజింగ్‌లో ఈ నెల13 నుంచి 16వరకు జరిగే ఆసియన్‌ రాజకీయ పార్టీల ప్రత్యేక సదస్సుకు సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వంతో ఏచూరి సమావేశం .

60మంది సిపిఎం నేతల అరెస్ట్..

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమండిలో పేదల భూముల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులతో పాటు రైతులను అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘుతో పాటు 60 మంది నేతలను అదుపులోకి తీసుకుని నాగాయలంక పీఎస్ కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్ దీక్ష భగ్నం..

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు.

భ్రమరావతి - ప్రైవేటు చంద్రహారతి!

రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ ఉత్సవం నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్‌ భవితవ్యానికి బంగారు బాట అని శత విధాల ప్రచారం చేస్తున్నది. అనుకూల మీడియా కూడా అదే తరహాలో ఆకాశానికెత్తి చూపిస్తున్నది. రాజధానిగా అమరావతి ఎంపికను గాని, అక్కడ నిర్మాణం ప్రారంభిం చడాన్ని గాని వ్యతిరేకిస్తున్నవారె వరూ లేరు. కాకపోతే శ్రుతిమించిన హంగామాపై వ్యా ఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగు ప్రారంభం ఆర్భాటాన్ని బట్టి పైసలు రావు. అలాగే తమ కృషిని బ్రహ్మాండంగా చూపించుకోవాలనే తాపత్రయంలో మోయ లేని ఖర్చును మీద వేసుకోవడం అవసరమా?

పేదలంటే ప్రభుత్వానికి అలుసెందుకు?

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 లక్షల ఎకరాలతో భూమి బ్యాంకునే ఏర్పాటు చేసి పారిశ్రామిక వృద్ధికి వినియోగించాలని చెబుతున్నది ఈ భూ సేకరణకు ప్రభుత్వం ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వల్ల రాజ్యాంగ లక్ష్యమైన పేదరిక నిర్మూలన దెబ్బతింటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భూమి పంపకం జరగకుండా పేదరిక నిర్మూలన జరగడం కల్ల అని చెప్పారు. మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలు, అతివాద ఉద్యమాలు భూపంకం ఎజెండాను ముందుకు తెచ్చాయి. అందువల్లనే 1955 ఎఐసిసి ఆవడిలో భూ సంస్కరణలు తెస్తామని తీర్మానం చేయవలసి వచ్చినది.

సిలిగురి సంకేతం..

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సుశాంత రంజన్‌ ఉపాధ్యాయ చేసిన రాజీనామా ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ దురహంకారాన్ని కళ్లకు కట్టింది. సుశాంత్‌ రంజన్‌ రాజీనామాచేస్తూ 'ఒక రాజకీయ పార్టీకి ఇది తగని పని. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరాదు' అంటూ మమత పార్టీపై చేసిన ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేట్‌ దిగ్గజాలు, మత ఛాందసులు, మావోయిస్టుల అండదండలతో 'పరివర్తన్‌' పేరిట 2011లో కొల్‌కతా గద్దెనెక్కినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అరచాక దాడులకు బెంగాల్‌ ఆలవాలమైంది.

అడిగితే తప్పా?

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం.

Pages

Subscribe to RSS - October