July

ప్రజాసమస్యల పరిష్కరానికై విజయవాడలో ప్రజారక్షణ పాదయాత్ర

సిఎం చంద్రబాబు పాలన వ్యాపారమయంగా మారిపోయిందని, పౌర సేవలను డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ఆదివారం విజయవాడలోని 45వ డివిజన్‌ మధురానగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరించడానికి చేపట్టిన ప్రజారక్షణ యాత్రకు అందరూ మద్దతు తెలిపాలని కోరారు.

హోదా , విజభన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహానికి నిరసనగా 23వతేదీన మండలకేంద్రాల్లో ధర్నాలు

పట్టణ ప్రాంత సమస్యలపై రాష్ట్ర సదస్సు

రాష్ట్రంలో ప్రజానుకూల, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలతో కలసిరావాలని అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులకు, సంఘాలకు పట్టణ ప్రాంత సమస్యలపై విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పై పన్నుల భారం లేకుండా ఉండాలని, స్థానిక సంస్థ లకు 40 శాతం రాష్ట్ర ఆదాయాన్ని బదలాయించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 16 నుంచి 24 వరకు అన్ని నగరాల్లో సమస్యల పరిష్కారానికై పాదయాత్ర నిర్వహించాలని, అందరికీ ఇళ్లు కోసం మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని సదస్సులో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15న 'మహాగర్జన' పేరుతో విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. 

Pages

Subscribe to RSS - July