పార్టీ కార్యక్రమాలు

Fri, 2015-10-23 18:56

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడూతూ ప్రధాని మోడి రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్థాడని ప్రజలు ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పైనా, ఆర్ధికంగా,...

Wed, 2015-10-21 16:39

మ‌న్యంలో మ‌లేరియా, ఇత‌ర విషజ్వ‌రాల‌ బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో  సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాలు తీర్చి, ప్రాణాలు నిల‌బ‌ట్టే వైద్య‌శాల‌గా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్  మిడియం బాబూరావు సార‌ధ్యంలో జేవీవీ, ఇత‌ర ప్ర‌జా రంగాల వైద్యులు, నెల్లూరు ప్ర‌జావైద్య‌శాల‌కు చెందిన వైద్యులు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి సేవ‌లు అందించారు. సెరిబ్ర‌ల్ మ‌లేరియాతో వ‌ణుకుతున్న గిరిజ‌నుల‌ను ఆదుకుని వారి ప్రాణాలు నిల‌బెట్టిన ఈ శిబిరానికి ప‌లువురు స‌హాయం అందించారు.

Tue, 2015-10-20 12:25

 పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్‌ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ఏరియాలో భూ బ్యాంక్‌ ద్వారా గిరిజన...

Mon, 2015-10-19 14:16

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక...

Sat, 2015-10-17 12:20

అర్హులైనవారందరికీ ప్రభుత్వం ప్రకటించిన భూమిలేని నిరుపేదలకు ఇస్తానన్న రూ.2500లు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్దఎత్తున ముట్టడించారు. వందలాదిమంది కార్యాలయం ఆవరణలోకి జొరబడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కాల కార్యకర్తల ప్రమేయం పెరగడం వలనే అనర్హులకు అందలాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Fri, 2015-10-16 11:09

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం  ఆధ్వర్యం లో  పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్‌ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు. కడప జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చామని చెపుతున్నారని, ఈ మొత్తం పడిపోయిన స్కూల్‌ బిల్డింగులు రిపేరు చేయడానికి కూడా చాలవని విమర్శించారు. రాయలసీమ ప్రాంత సమ స్యల పరిష్కారం కోసం...

Tue, 2015-10-13 11:30

సంఘటితంగా ఉద్య మించి ఇళ్ల పట్టాలు, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం సాధించుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న గూడును కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు కృష్ణాకరకట్ట నివాసుల పరిరక్షణకై రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామలింగేశ్వర్‌నగర్‌లోని తారకరామా నగర్‌, ఇతర ప్రాంతాల్లో సోమవారం పాదయాత్ర చేశారు. బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో కృష్ణాకరకట్ట పరివాహక ప్రాంత పరిధిలోని 8.5 కిలోమీటర్ల పరిధిలో పేదలు నివాసాలుండే గృహాలను తొలగించాలన్న ప్రభుత్వం యోచనను అందరూ సంఘటితంగా తిప్పికొట్టాలని కోరారు. ఇప్పటికే భవానీపురం ప్రాంతనివాసులకు కార్పొరేషన్‌ అధికారులు...

Sat, 2015-10-10 12:50

విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి  చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Thu, 2015-10-08 17:01

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వ్యాన్ లలో పడేశారు....

Thu, 2015-10-08 09:41

సోలార్‌ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు బుధ వారం అనంతపురం జిల్లా నంబూల పూలకుంట (ఎన్‌పి కుంట) మండలానికి వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ను పోలీసులు అడుగడుగునా అడ్డుకు న్నారు. భూముల వద్దకెళ్లి నిర్వాసిత రైతుల సమస్యలను తెలుసుకోకుండా సిపిఎం నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మధు పర్యటన సాగింది. ఎన్‌పి కుంట మండలంలో 10,700 ఎకరాల్లో సోలార్క్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,500 ఎకరాల భూములను సేకర ణకు పూనుకున్నారు. ఈ భూములకు సంబంధించి కొందరు బినామీ వ్యక్తులకు పరిహారం
ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు వాస్తవ రైతులకు ఇస్తున్న పరిహారం...

Tue, 2015-10-06 10:51

ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా.. అండగా ఉండేందుకు సీపీఎం రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్మి పి.మధు డిమాండ్ చేసారు.ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రజల సంతోషాల మధ్య శంకుస్థాపనలు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించలేదని బాధలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామలు నెరవేర్చడం లేదని, గత పది నెలల నుండి పని, ఉపాధి లేదని పేర్కొన్నారు. 

Mon, 2015-10-05 17:46

 ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు  ఎంఏ గఫూర్ విమర్శించారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

Pages