October

ఆక్వాఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా

తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

అర్ధ‌రాత్రి సిపియం నాయ‌కుల అర‌స్టుల ప‌ర్వం

  వెంక‌య్య నాయుడు తిరుప‌తికి వ‌స్తున్న సంద‌ర్భంగా రాష్ట్ర‌నికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసాడ‌ని శ‌నివారం ఉద‌యం  నిర‌స‌న కార్యక్ర‌మం త‌ల‌పెట్టారు. ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌గ‌నీయ‌కుండా చేయ‌డానికి అర్థ రాత్రి నుంచి  సిపియం నాయ‌కుల అర‌స్టుచేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు.

గొంతువిప్పినకార్పొరేట్ దిగ్గజం

దేశంలో నేడు మైనార్టీ సముదాయాలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఒక మీడియా ఇంటర్వూలో మాట్లాడుతూ, దేశం ఆర్థిక వృద్ధి సాధించాలంటే భయ వాతావరణాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా ఒక కార్పొరేట్‌ దిగ్గజం గొంతు విప్పడం ఇదే మొదటిసారి. అసహనం తగదని మూడీస్‌ అనాలిటిక్స్‌ మోడీకి సూచన చేసిన తర్వాత నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Rss నిషేధం గుర్తురాలేదా:లెఫ్ట్

దేశంలో ఐక్యత, శాంతి, సామరస్యత వుంటేనే ప్రగతి సాధ్యమంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్దార్‌ పటేల్‌ పేరిట శనివారం ఇక్కడ 'ఐక్యతా పరుగు' (రన్‌ఫర్‌ యూనిటీ) కార్యక్రమం నిర్వహించిన ఎన్డీయే సర్కారుకు అప్పట్లో హోం మంత్రిగా వున్న పటేల్‌ మహాత్ముని హత్యానంతరం ఆరెస్సెస్‌ నిషేధం విధించిన విషయం గుర్తు రాలేదా అని వారు ప్రశ్నించారు. దేశ ఐక్యత, శాంతి, సామరస్యతల కోసం ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రధాని గుర్తించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. వారంతా (ప్రధాని నేతృత్వంలోని కాషాయదళం) ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ సంస్థలకు చెందిన వారే.

దాద్రీ ఘటనకు వినూత్న నిరసన

పిఎల్‌ సుందరం తన పార్టీ కార్యకర్తలతో కలసి 'తమిళ మానిల వివసాయిగళ్‌ సంగం' (తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ కార్మికుల అసోసియేషన్‌) ఇక్కడికి 65 కిలోమీటర్ల దూరంలోని సత్యమంగళంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక ప్యాకెట్‌ను బయటకు తీసి, ఇది గొడ్డుమాంసమని, దీన్ని తాను తింటున్నానంటూ, కొన్ని ముక్కలను ప్రదర్శనకారులకూ పంచిపెట్టారు. ఒక గంట పాటు జరిగిన ఈ నిరసన ప్రదర్శనకు పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.

లెఫ్ట్‌పై జైట్లీ పెదవివిరుపు..

వామ పక్షాలు భారత్‌లో అసహనాన్ని పెంచి పోషిస్తున్నా యని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపిం చారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక అసహనాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రణాళికాబద్ధమైన ప్రచారం ద్వారా భారత్‌ను అసహన సమాజంగా మార్చేస్తున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలో విమర్శించారు.

చంద్రులు ఒక్కటయ్యారు:తమ్మినేని

ఓటుకు నోటు కేసులో ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఒక్కటయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ...సహారా కేసు విషయంలో 90 ప్రశ్నలకు కెసిఆర్‌ సమాధానం చెప్పాల్సి ఉండగా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్‌ వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆశాల సమ్మె వెనుక ఆంధ్రా కుక్కలున్నాయని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నోరు పారేసుకున్నారని, అదే ఆంధ్రా సిఎం చంద్రబాబు మీద కేసు పెట్టే దమ్మూ ధైర్యం ఈ మంత్రులకు ఎందుకు లేదని ప్రశ్నించారు.

Pages

Subscribe to RSS - October