October

రాజధాని శంకుస్థాపనకు ఏడాది

వ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఒక్కడుగు ముందుకు పడని రాజధానిలో ప్రధానమంత్రి మోడీ ఇచ్చివెళ్లిన మట్టే మిగిలింది.ఏడాదైనా మోడీ తెచ్చిన మట్టీ నీరు తప్ప మిగిలిందేమీ లేదు. ఇంకా భవనాలకు శాశ్వత డిజైన్లు లేకపోవడం విడ్డూరం. వ్యవసాయ కూలీలు, స్థానికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్చలూ చేపట్టడం లేదు. రైతులకు ప్లాట్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతోంది' 

4లక్షల11వేల ఎకరాలను లాక్కుంటున్నారు

రైతుల అంగీకారం లేకుండా భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేయడాన్ని వామపక్షాలు ఎప్పటికీ అంగీకరించవన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోని 59 మండలాల్లో 4 లక్షల 11 వేల ఎకరాలకు పైగా భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు అన్నారు. చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం అమెరికాను అనుసరిస్తోంది..

భారతదేశం కూడా అమెరికా విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్‌ విమర్శించారు. ప్రణాళికా సంఘం(ప్లానింగ్‌ కమిషన్‌) ఎత్తివేతే దీనికి నిదర్శనమన్నారు. అక్టోబర్‌ 14 నుంచి సంగారెడ్డిలో జరగనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల నేపథ్యంలో విలేకర్లతో వారు మాట్లాడారు. అమెరికాలో ప్లానింగ్‌ కమిషన్‌ ఉండదనీ, ఇక్కడ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రణాళిక లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తామనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

కాశ్మీర్‌ ప్రస్తావనపై భారత్‌ ఆగ్రహం

ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రస్తావించడం పట్ల భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌పై లేని ఆధిపత్యానిన చలాయించేందుకే పాకిస్తాన్‌ ఈ అనవసర పటాటోపాన్ని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్‌ విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ ఇలా అంతర్జాతీయ వేదికను ఉపయోగించు కోవడమంటే దాన్ని దుర్వినియోగం చేయడమేనని భారత్‌ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగ మేనని మరోసారి పునరుద్ఘాటించింది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి.

ఆక్వాఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా

తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

అర్ధ‌రాత్రి సిపియం నాయ‌కుల అర‌స్టుల ప‌ర్వం

  వెంక‌య్య నాయుడు తిరుప‌తికి వ‌స్తున్న సంద‌ర్భంగా రాష్ట్ర‌నికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసాడ‌ని శ‌నివారం ఉద‌యం  నిర‌స‌న కార్యక్ర‌మం త‌ల‌పెట్టారు. ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌గ‌నీయ‌కుండా చేయ‌డానికి అర్థ రాత్రి నుంచి  సిపియం నాయ‌కుల అర‌స్టుచేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు.

Pages

Subscribe to RSS - October