October

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నిర్బంధం

గత వారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపలా వెలుపలా అట్టుడికిపోయింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సభను వేడెక్కిస్తే- ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్దేశించిన చలో అసెంబ్లీపై అణచివేత బయిట నిరసనాగ్ని రగిల్చింది. ఒక విధంగా విభజనకు ముందు చలో అసెంబ్లీల సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఆత్మహత్యలు కూడా తెలుగు దేశం పాలన చివరి రోజులను మించిపోయే రీతిలో జరగడం ఆవేదనా కారణమైంది. గత విధానాలే అమలు జరుగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నాటి ఉద్యమ కారులే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది.

పోర్టు మాటున భూదందా!

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

కార్మిక వర్గ అంతర్జాతీయతకు డబ్ల్యుఎఫ్‌టియు కృషి

 పారిస్‌లో 1945 అక్టోబరు 3న స్థాపించ బడ్డ ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ టియు) దిగ్విజయంగా 70 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కార్మిక వర్గ అంతర్జాతీయ తకు, ప్రపంచ కార్మికోద్యమ ఐక్యతకు కృషి చేస్తున్న వారు సాధించిన విజయం ఇది. రాజకీ య లేదా కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుం డా కార్మికవర్గ ప్రయోజనాల ఆధారంగా కార్మికులందరినీ ఒక తాటి మీదకు తేవటం డబ్ల్యుఎఫ్‌టియు విశిష్టత.

దేవాలయ భూముల నుంచి పేదలను తరిమేస్తున్న ప్రభుత్వం

 రాష్ట్రంలో వివిధ దేవాలయాల క్రింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలకు పనికొచ్చే భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కౌలుకు తీసుకొని వేలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నారు. వీరు అసలు భూమిలేని నిరుపేదలు లేదా కొద్దిగా ఉన్న పేద రైతులు. దేవాలయ భూముల కౌలు రైతుల్లో అత్యధికులు బిసి, ఎస్‌సి ఎస్‌టి తరగతులకు చెందినవారే. ఒక వైపు పేదలు క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తూ సాగుచేసు కొంటుండగా మరోవైపు దేవాలయ భూములను ధనికులు ఆక్రమించుకొని కోర్టు లిటిగేషన్‌లో ఉన్నాయి. మరి కొందరు ధనికులు కౌలుకు తీసుకొని పేదలకు ఆ భూములకు అధిక కౌలుకు సబ్‌ లీజుకు ఇస్తున్నారు.

ICDS నిర్వీర్యానికి కుట్రలు..

''తిండి కలిగితె కండ కలదోరు-కండ కలవాడేను మనిషోరు'' అని చెప్పిన మహాకవి గురజాడ 153వ జయంతి ఇటీవల జరిగింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ లకు పౌష్టికాహార కల్పన, శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా 1975 అక్టోబర్‌ రెండున దేశంలో కేవలం 33 ప్రాజెక్టులతో ప్రారంభమైన ఐసిడిఎస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసు కొంది. నేడు 13.40 లక్షల అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా 10 కోట్ల మందికి పైగా సేవలంది స్తున్నది. ఇందులో 8.41 కోట్ల మంది ఆరేళ్ల లోపు పిల్లలు, 1.9 కోట్ల మంది గర్భిణీ, బాలింత స్త్రీలు.

మొసలి కన్నీరుతో కౌలు రైతులకు ఒరిగేదేంటి?

రైతు ఆత్మహత్యలపై ఎప్పుడూ స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల తెగ బాధపడుతూ మొసలి కన్నీరు బక్కెట్లు బక్కెట్లు కారుస్తున్నారు. అంతేగాక జరుగుతున్న వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో 70 శాతం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు చట్ట ప్రకారం ఇచ్చే విష యాన్ని నిర్దిష్టంగా చర్చించకుండా దాటవేశారు. సెప్టెంబరు నెలలోనే రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది పొగాకు రైతులు ఈ నెలలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత 15 నెలల్లో 164 మంది బలవన్మరణం పాలయ్యారు.

దుర్మార్గపు వ్యాఖ్యలు..

కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్‌ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే.

అసహన ప్రతిరూపం..

ఒకానొక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం ఎంతైనా ఆందోళనకరం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు సర్కార్లే నడుం కట్టడం అత్యంత ప్రమాదకరం. నిరసనోద్యమాలు, ప్రజాందోళనలపై చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో మానవ హక్కుల హననం చేసి ఉక్కుపాదం మోపడం ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది.

రూ.4,417 కోట్ల నల్లధనం..

విదేశాలలో దాచిన నల్లధనం ఆస్తుల విలువ మరింతగా పెరిగింది. సెప్టెంబరు 30తో ముగిసిన '90 రోజుల నల్లధనం వెల్లడి పథకం'లో దాదాపు 638 మంది తమ నల్లధన ఆస్తుల విలువను వెల్లడించినట్లుగా రెవెన్యూ కార్యదర్శి హష్ముక్‌ ఆధియా సోమవారం తెలిపారు. వారు వెల్లడించిన మొత్తం అక్రమాస్తుల విలువ రూ.4,417 కోట్లకు చేరినట్లు ఆయన వివరించారు.

Pages

Subscribe to RSS - October