పార్టీ కార్యక్రమాలు

Fri, 2018-06-15 11:08

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కబేళా, సింగ్‌నగర్‌లో, జక్కంపూడి వైఎస్‌ఆర్‌కాలనీలో మధ్యలో...

Wed, 2018-06-13 11:32

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.పెద్దిరెడ్డి, ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తదితరులను పోలీసులు...

Mon, 2018-05-28 11:11

ఏ.కొండూరు కిడ్నీ బాధితులందరికి ఆర్థికసహయం, ఆయా కార్పొరేషన్ల నుండి ఋణాలు, తిరువూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, అన్ని గ్రామాలకు పైపులైన్ ద్వారా కృష్ణ జలాల సరఫరా, పెన్షన్లు, డయాలసిస్ చేయించుకునే వారికి అంబులెన్స్, ఉచితంగా మందుల సరఫరా, చనిపోయిన కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రెసియా వెంటనే ఇవ్వాలి.భావితరాలకు కిడ్నీ సమస్య రాకుండా చౌక డిపోల ద్వారా పౌష్టికాహారం అందించాలి వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ch. బాబురావు గారు,సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి d.v కృష్ణ గారు,జిల్లా కమిటీ సభ్యులు g. విజయప్రకాశ్ గారు అధికారులకు వినతిపత్రం అందించారు.

Tue, 2018-05-22 15:56

రాష్ట్ర సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు,సాయుధ తెలంగాణ పోరాటాయోధుడు,కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నేతగా,శాసన సభ్యుడు గా ఎదిగి స్వంత ఆస్తి లేకుండానే మరణించిన ఆదర్శనేత కామ్రేడ్ పర్స సత్యన్నారాయణ గారి మూడవ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్న సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నర్శింగరావు ఎంఏ గఫూర్ లు...

Mon, 2018-04-16 12:27

రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

Fri, 2018-04-06 15:30

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఎం,సిపిఐ,జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు . వైసిపి, టిడిపి చేసే పోరాటాల్లో చిత్తశుద్ధి లేదని చెప్పారు. మేం నిజాయితీగా పోరాటం చేస్తున్నామని, కార్యకర్తలతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మ‌ధు, రామ‌కృష్ణ‌ మాట్లాడుతూ  21 రోజులుగా పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసానికి ప్రయత్నిస్తుంటే బిజేపి అడ్డుకుంటు వస్తోందన్నారు. ప్రజా క్షేత్రంలో అవిశ్వాసం పెట్టె హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు బిజెపిపై విశ్వాసం లేదన్నారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్ఘాటించారు. బంద్‌, హర్తాళ్లతో ఆందోళనకు...

Wed, 2018-03-07 16:46

ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

Mon, 2018-02-26 17:46

చింతపూడి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తున్న రాష్ట్రకార్యదర్శిమధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారం, ఇతర నాయకులు కార్యకర్తలు..

Thu, 2018-02-08 11:32

బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.  బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.

Sat, 2018-02-03 11:09

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామంలో దళిత వాడలో కనీస సౌకర్యాలు లేవని, వారు తీవ్ర వివక్షతకు...

Sat, 2018-01-13 16:05

గోట్టిపాడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన  పర్యటనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి  పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణయ్య ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.దళితులపై దాడుల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని మధు విమర్శించారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన కులోన్మాదుల్ని 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని, దళితులపై మోపిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, దళితులకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి, ఆ పంచాయతీకి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌...

Tue, 2017-11-21 14:44

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.  విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన...

Pages