పార్టీ కార్యక్రమాలు

Mon, 2016-08-29 11:11

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనేకేళ్లుగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే ప్రభుత్వ వాటికి హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు....

Sat, 2016-08-20 13:49

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...

Thu, 2016-08-18 15:52

కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు. పుష్కరాల హడావుడితో ట్రాఫిక్‌ ఆంక్షలను అంచనాలను మించి...

Tue, 2016-08-02 13:23

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా  సిపిఎం శ్రేణులు ఆందోళన చేశారు.. టిడిపి పార్టీది అవకాశవాద రాజకీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు..కేంద్రం ప్రకటించిన ఎటువంటి హామీలు అమలు కాలేదని, ప్రతిపక్షాలు నిరసనలు..బంద్ లు చేపట్టవద్దని, జపాన్ తరహాలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతోందని విమర్శించారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రదర్శనలు చేయవచ్చు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు నిరసనలు..ఆందోళనలు చేయవద్దా అని ప్రశ్నించారు. అవకాశ వాద రాజకీయాల మీద బతుకుతోందని తెలిపారు.

Mon, 2016-08-01 13:35

ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు  పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు అతితక్కువగా కేటాయించి ఈ పార్లమెంట్‌ సమావేశంలో నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని చెబుతున్నారు. ద్రవ్యలోటు...

Fri, 2016-07-22 10:37

రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 

Sat, 2016-07-16 17:29

శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సుకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాశ్ కరత్ హాజరయ్యారు .భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటానికి యత్నిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి పెట్టుబడి రూ.2లక్షల 80...

Tue, 2016-07-12 10:30

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా బాధితులకు నష్టపరిహారమివ్వాలని, దీనికి బాధ్యతగా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ అధికారులపై...

Thu, 2016-07-07 16:03

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించనున్న అణు పార్కుతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు తెలి పారు.  సైట్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణ యం చేయకుండా రైతుల నుంచి భూములు తీసుకునే అది ప్ర‌కారం ప్రభుత్వానికి లేదన్నారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో నిర్మించాల్సిన అణుపార్కును కొవ్వాడకు తరలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ నాలుగున ప్రకటించిందని, మోడీ-ఒబామా ఒప్పందం జూన్‌ ఏడున జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది చెప్పడం లేదని తెలిపారు. టిడిపి తక్షణమే తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Sat, 2016-06-25 15:19

అనంతపురం జిల్లా పాల ఉత్పత్తిదారులకు ఏపి పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. సేకరణ ధర తగ్గింపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వరుస కరవులతో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా లో ఆత్మహత్యలు, వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత, పాడి పరిశ్రమ ప్రధాన జీవనా ధారంగా ఉందన్నారు. జిల్లాలో ప్రతి రోజూ ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుందని, వీటిలో 85 వేల లీటర్లను మాత్రమే ఏపి డెయిరీ సేకరిస్తోందని తెలిపారు. మిగిలిన పాలు హైదరాబాద్‌, ఒంగో లు...

Wed, 2016-06-15 12:24

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రజల తాగు, సాగు, పారిశ్రామిక...

Wed, 2016-06-08 18:21

కృష్ణంక జాతీయ రహదారి నుంచి ఫీడర్‌ రోడ్డుకు మూడు చోట్ల సబ్‌మే, అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాని సిపిఎం తపెట్టిన ధర్నా అరెస్ట్‌కు దారి తీసింది. కృష్ణంక సత్యం హోటల్‌ సమీపంలో బుధవారం సిపిఎం తూర్పు`1 జోన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనకాయి రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాస్తారోకో చేసి విరమిస్తామని సిపిఎం నాయకు చేసిన విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా పోలీసు సిబ్బంది తరలి వచ్చి ఆందోళనకారును దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్‌ు చేశారు. ఈ సందర్బంగా జాతీయ రహదారిపై కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుకు, ఆందోళనకారు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. సబ్‌మే ఏర్పాటు చేయాని,...

Pages