పార్టీ కార్యక్రమాలు

Wed, 2018-08-01 13:42

పశ్చిమ కృష్ణా ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నియంత్రించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద బాధితులు ధర్నా చేశారు. వ్యాధి వల్ల తాము ఎక్కువ సేపు కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు చేయూత లేకపోవడంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా చేస్తానన్న సిఎం చంద్రబాబునాయుడు మరింత రోగాంధ్రగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చినా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో 111 మంది...

Tue, 2018-07-31 13:16

విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగడతామని చెప్పారు.  

Wed, 2018-07-25 13:17

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాని మార్పు చేసి రైతుల నుండి బలవంతంగా భూమి గుంజుకుంటుందని అన్నారు. భూసేకరణ చట్టంలో రైతుల నుండి భూమి తీసుకున్న తర్వాత 5సంవత్సరలోపు ఎటువంటి పనులు ఆభూములలో చేయకపోతే తిరిగిరైతుకు భూమి ఇవ్వాలని ఉందని కానీ చంద్రబాబు భూసేకరణ చట్టసవరణ ద్వారా ఆ విషయాన్ని చట్టం నుండి తొలగించారని అన్నారు.. రైతులకు అండగా సిపిఎం ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

Mon, 2018-07-23 10:30

సమాన విద్య-ఉపాధి గ్యారంటీ కోసం రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సమాన విద్య-ఉపాధి గ్యారెంటీ కోసం వామపక్ష పార్టీల రాజకీయ ప్రత్యామ్నాయంపై తిరుపతి యశోధనగర్‌లోని ఎంబి భవన్‌లోకోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. దీనికి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నంపెంచులయ్య అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ దివాళాకోరుతనానికి బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో ప్రయివేటీకరణ, మతోన్మాద విధానాలు చొప్పించే...

Mon, 2018-07-23 10:17

అన్ని విధాలా వెనుకబాటుకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ది కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని వామ పక్ష నేతలు ప్రకటించారు. జిల్లాను అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురిచేసిన పాలక, ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదన్నారు. రాష్ట్రానికి హోదా కావాలని కోరుతున్న ముఖ్యమంత్రికి వెనుకబడిన జిల్లాలు గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. అభివృద్ధిని కోరే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏటీసీ హాలులో జరి గిన సదస్సుకు సిపిఎం ప్రకాశం జిల్లా (తూర్పుప్రాంత) కమిటీ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్‌.నారాయణ అధ్యక్షత...

Mon, 2018-07-23 10:14

సిఎం చంద్రబాబు పాలన వ్యాపారమయంగా మారిపోయిందని, పౌర సేవలను డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ఆదివారం విజయవాడలోని 45వ డివిజన్‌ మధురానగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరించడానికి చేపట్టిన ప్రజారక్షణ యాత్రకు అందరూ మద్దతు తెలిపాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ సామాన్యులు ఎక్కడైనా ఇల్లు...

Mon, 2018-07-16 11:14

రాష్ట్రంలో ప్రజానుకూల, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలతో కలసిరావాలని అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులకు, సంఘాలకు పట్టణ ప్రాంత సమస్యలపై విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పై పన్నుల భారం లేకుండా ఉండాలని, స్థానిక సంస్థ లకు 40 శాతం రాష్ట్ర ఆదాయాన్ని బదలాయించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 16 నుంచి 24 వరకు అన్ని నగరాల్లో సమస్యల పరిష్కారానికై పాదయాత్ర నిర్వహించాలని, అందరికీ ఇళ్లు కోసం మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని సదస్సులో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15న 'మహాగర్జన' పేరుతో విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. 

Thu, 2018-07-12 12:27

గుంటూరులో అక్ర‌మంగా అరెస్టు చేసిన ముస్లిం యువ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, వారిపై పెట్టిన అక్ర‌మ‌కేసుల‌ను ఎత్తివేయాల‌ని కోరుతూ సిపిఎం,సిపిఐల ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు.అక్ర‌మంగా అరెస్టు అయిన బాధితుల కుటుంబాల‌ను పరామర్శించడానికి  బ‌య‌లుదేరిన సిపిఎం కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు.సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు, రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు వి.కృష్ణ‌య్య‌, సిపిఐ నాయ‌కులు ఓబులేసు, మాజీ ఎమ్మేల్సీ కె.ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుల‌ను అరెస్టు చేసి న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు 

Wed, 2018-07-04 15:15

విజయనగరం జిల్లా సాలూరు లోని గిరిజన ప్రాంతాలలో శిఖపరువు,తామరకొండ, పోలిమెట్ట,దుక్కడమెట్టల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తామరకోండ,పోలిమెట్ట,దుక్కడమెట్ట శిఖపరువు కొండలను త్రవ్వకాలు చేయవదంటూ సిపిఎం నాయకత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలోని  పనులు అడ్డుకోవడం కోసం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ కృష్ణమూర్తి ప్రజలతో  కలిసి ర్యాలీగా బయలుదేరారు.. 

Fri, 2018-06-29 12:08

ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతోనే జిల్లా బతుకు ఆధార పడి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనానంతరం కనీసం ఆరు నెలల్లోపు కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా దాని వూసే లేదని పేర్కొ న్నారు. జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉందన్నారు. అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష మందికిపరోక్షంగా ఉపాధి అవకాశం...

Wed, 2018-06-27 16:19

దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్‌, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు. దళితులు, కార్మికులు, గిరిజనులు ఉన్న హక్కులు కోల్పోతున్నారన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన్‌...

Wed, 2018-06-20 14:10

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. కేంద్రం పెట్రోలు, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడంతో రైతులపై వందల కోట్ల రూపాయల భారాలు పడ్డాయని, ఇదే సమయంలో రైతులకు గిట్టుబాటు...

Pages