2015

మళ్లీ శివసేన కవ్వింపు చర్యలు..

శివసేన మళ్లి శివమెత్తింది. ఈసారి బిసిసిఐ కార్యాలయంపై దాడికి దిగింది. భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ సిరీస్‌కు వ్యతిరేకంగా సమావేశాన్ని అడ్డుకుంది. దీంతో బిసిసిఐ-పిసిబిల సమావేశం రద్దయ్యింది. శివసేన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

వార్తా చానళ్లలో FDI పెంపు..

వార్తా చానళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తెలిపారు. వార్తల నాణ్యత లోపించడంపై, పాత్రికేయులకు శిక్షణ కోసం చాలా తక్కువ వ్యయం చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూసేన ఇంకు దాడి..

 జమ్మూ కాశ్మీర్‌ ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎ ఇంజనీర్‌ రషీద్‌పై ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో దాడి జరిగింది. ప్రెస్‌ క్లబ్‌ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు ఆయనపై సోమవారం మధ్యాహ్నం ఇంకు, ఆయిల్‌తో దాడి చేశారు. కొద్ది మాసాల క్రితం ఆయన బీఫ్‌ పార్టీకి ఆతిధ్యమిచ్చినందుకు నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డారు. తొలుత ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో రషీద్‌ మాట్లాడుతూ, ''నా ఆవుతో ఏం చేస్తానన్నది నా ఇష్టం. నా ఆవుతో ఇతరులకు ఏం పని?'' అని ప్రశ్నించారు. రషీద్‌, మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది నిముషాలకే ఈ దాడి జరిగింది. కాగా ఈ దాడికి కారకులైన ఇద్దరిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఆత్మహత్యలు విషాదకరం :తరిగామి

కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే, ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమ నాయకుడు యూసఫ్‌ తరిగామి సోమవారం పరామర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన 16 మాసాల్లో అనంతపురం జిల్లాలో 39 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.

రచయితలకు తోడ్పాటుగా నిలుద్దాం!

హిందూ ఫాసిస్టు రాజకీయాలు వేర్వేరు రూపాల్లో ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజాసాహిత్య సృష్టికర్తల మీద, వారి కలల మీద సంకెళ్లను విదిలిస్తోంది. దేశంలోనూ 'సాంస్కృతిక జాతీయవాదం' సృజనరంగాన్ని కత్తుల బోనులోకి నెట్టేస్తున్న వైనం కళ్ళ ముందు విస్తరిస్తున్నది. ఆర్య జాతి సాంస్కృతిక ఆధిపత్యం పేరుతో జర్మనీలో హిట్లర్‌ సాగించిన మారణకాండకు మరో రూపంగా సదరు మానసిక, భౌతిక హింసను ఇక్కడ ప్రవహింపజేయటానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) వేర్వేరు రూపాలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది.

భూ బ్యాంక్‌ పేరిట భూములు గుంజుకోవద్దు..

 పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్‌ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు.

పర్యావరణ ఆమోదం బూటకం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణా నికి అవ సరమైన పర్యావరణ ఆమోదాన్ని సక్రమ మైన పద్ధతిలో పొందలేదని పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలువి మర్శిస్తున్నాయి. స్టేట్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌ అథారిటీ(ఎస్‌ఇఐఎఎ)కి రాజధాని పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని నిబంధనలు రూపొందించకుండా క్రిడా పర్యావరణ ఆమోదాన్ని ఎలా పొందిందని నిపు ణులు విమర్శిస్తున్నారు. కన్సల్టెంట్‌ను నియమించ కుండా, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించకు ండా పర్యావరణ క్లియరెెన్స్‌ ఎలా లభిస్తుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడిపై రెగ్యులేటరీ ఏజెన్సీ కాగితంపై రబ్బర్‌ స్టాంప్‌ వేసి ఇచ్చిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

దారిద్య్రం గురించి మరోసారి..

అక్టోబరు 6వ తారీఖున హిం దూపత్రికలో ప్రపంచంలో దారి ద్య్రం తగ్గిందనే ప్రపంచ బ్యాంకు అంచనాకు సంబంధించిన వార్త ప్రచురింపబడింది. ప్రపంచం మొత్తంమీద 2011లో 14.2శాతం మంది దారిద్యంలో ఉంటే ఆ సంఖ్య 2012లో 12.8 శాతంగా నమోదయింది. భారతదేశం లో కూడా దారిద్య్రం అదే స్థాయిలో తగ్గినట్లు ఆ వార్తా కథనంలో ఉన్నది. ప్రపంచబ్యాంకు అలాంటి నిర్ధారణకు ఎలా వచ్చింది? ముఖ్యంగా భారతదేశం విషయంలో అదొక మిస్టరీగా మిగలనున్నది. ఎందుకంటే భారతదేశంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే 5 సంవత్సరాలకొకసారి విస్తృత సర్వే చేస్తుంది. మిగతా సంవత్సరాలలో అంతగా ఆధారపడజాలని చిన్న చిన్న సర్వేలు చేస్తుంది. వీటిని అంతగా ఉపయోగిం చరు.

స్మార్ట్‌ నగరాలు ఎలా?: కేజ్రీ

నగరాల్లో పేదలను పేదలుగానే వుంచి స్మార్ట్‌ సిటీలను సాధించలేమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. నగరాల్లోని ప్రజలు పేదరికం, నిరుద్యోగం, కనీస సౌకర్యాలైన మంచి నీటికొరత లాంటి ఇబ్బందులతో సతమతమవుతుంటే అవి ఎలా స్మార్ట్‌ నగరాలుగా మారతాయని ఆయన ప్రశ్నించారు. మొదట ప్రజల జీవితాలను స్మార్ట్‌ చేయండి ఆ తరువాత స్మార్ట్‌ సిటీల గురించి మాట్లాడొచ్చు అని ఆయన కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

కేరళలో దేశీ కాల్‌ టాక్సీ :CPM

దేశీయంగా రోజురోజుకూ ప్రాబల్యం పెంచుకుంటున్న ఉబర్‌, ఓలా కార్పొరేట్‌ ఆన్‌లైన్‌ టాక్సీ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా కేరళలో దేశీ కాల్‌ టాక్సీ, కాల్‌ ఆటో రిక్షా సర్వీసులను తీసుకొచ్చేందుకు కేరళలో సిపిఐ(ఎం) కృషిచేస్తోంది. కార్పొరేట్‌ రంగంలోని ఆన్‌లైన్‌ టాక్సీ సర్వీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం , ఈ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ప్రత్యామ్నాయంగా అత్యంత నమ్మకమైన, నిపుణులైన వారితో దేశీ టాక్సీ సేవలను ముందుకుతెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Pages

Subscribe to RSS - 2015