పార్టీ కార్యక్రమాలు

Fri, 2021-03-05 13:36

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో  అఖిల పక్ష పార్టీలు బంద్  నిర్వహించాయి..విశాఖ ఉక్కు అమ్మేహక్కు కేంద్రానికి లేదన్నారు. ఎందుకంటే ఎన్నో త్యాగాల పునాదిపై విశాఖ ఉక్కు నిలబడి ఉందన్నారు.కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బంద్‌ ఉద్యమానికి ఆరంభమేనన్నారు. బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

Fri, 2021-02-26 15:17

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మద్దిలపాలెం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వామపక్ష పార్టీల నేతల అరెస్ట్..

Mon, 2021-02-08 16:02

కేంద్ర బడ్జెట్టులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే.శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్రకార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు, అఖిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల.వెంకయ్య, వివిధ రాజకీయ, ట్రేడ్‌ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్పొరేటీకరణ విధానాలను ఖండించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపకుంటే బిజెపిని రాష్ట్రప్రజలు...

Sat, 2021-01-30 16:10

 

 తిరుపతి సి.పి.యం.ఆఫీసు నందు 'రైతు జీవితం' షార్ట్ ఫిలిమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి (MLC) , ఆర్పీఐ నాయకులు అంజయ్య తదితరలు

Fri, 2020-11-13 10:45

బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి, మత కలహాలు సృష్టించి, ప్రజల శవాలపై రాజకీయాలు చేస్తోందని, దీనిని ప్రజలు ఎన్నడూ క్షమించరని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాజకీయ ప్రచార యాత్ర కార్యక్ర‌మంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా పలమనేరు అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి బస్టాండ్‌ కూడలిలోని ఎటిఎం సర్కిల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్త అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బిజెపి, దాని అనుబంధ సంస్థలు చిన్నచిన్న గుడులు, మసీదులు ఎంచుకొని మతకలహాలు సృష్టించడానికి ప్రయత్సిస్తున్నాయని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం...

Fri, 2020-11-13 10:43

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కారణంగా గత ఎన్నికల్లో ఏకంగా 71సీట్లు సాధించిన జెడి(యు)కి ఈసారి కేవలం 43సీట్లే లభించాయని సంపాదకీయం వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్‌...

Wed, 2020-07-08 17:37

రాష్ట్రంలో పేదల కొరకు కట్టి ఖాళీగా ఉంచిన నాలుగు లక్షల ఇళ్ళు టిడిపి ,బిజెపి ,వైసిపి పార్టీల సొమ్ముతో నిర్మించినవి కావు ,ప్రజల సొమ్ము (ప్రభుత్వ నిధుల)తో కట్టిన ఇళ్లు తక్షణమే పేదలకు కేటాయించాలని డిమాండ్..
విజయవాడ నగరంలో డిస్నీలాండ్ లో 57ఎకరాలు ,సమీపంలో రైల్వే శాఖ కు ఇచ్చిన 26 ఎకరాలు ,పాత డంపింగ్ యార్డ్ లో 32 ఎకరాలు అజిత్ సింగ్ నగర్ లో మొత్తం 115 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నాయి. ఈ స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించకుండా నగరానికి లో 20 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతిలోను కంకిపాడు ,గన్నవరం ఏరియాలో కేటాయించడం లో అంతరార్థం ఏమిటి? నగరంలోని విలువైన స్థలాలు బిల్డ్ ఏపీ పేరుతో అన్ని ఖజానా నింపుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?
...

Tue, 2020-06-16 12:36

ఇన్కమ్ టాక్స్ పరిధిలో లేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యం మరియు నిత్యవసర వస్తువులు ఉచితంగా ఆరునెలలపాటు ఇవ్వాలని , కార్మిక చట్ట సవరణ లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని , పట్టణ పెదలకు ఉపాధి గ్యాటంటి పథకం పెట్టి ఉపాధి కాల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఎం ఆలిండియా పిలుపులో భాగంగా  భీమవరంలో మెంటేవారితోటలో, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పశ్చిమగోదావరి (డెల్టా) జిల్లా కార్యదర్శి బి.బలరాం మరియు స్థానిక పార్టీ నాయకులు 

Sun, 2020-05-24 16:46

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో సిపిఎం బృందం పర్యటన..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్లు మూతబడి, అంతర్ రాష్ట్ర రవాణా లేక పండించిన పళ్ళు ,కూరగాయలకు రేట్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా ఆచరణ బిన్నంగా ఉంది.మరోవైపు పంటలు తగినంతగా కోయక కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి, ఉపాధి హామీ పథకం రాజధాని తదితర ప్రాంతాల్లో అమలు జరగడంలేదని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు..

Sun, 2020-05-17 18:42

విజయవాడలో వందలాదిగా ఉన్న బెంగాలీ వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాట తప్పింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారి రూముల్లోకి వెళ్ళి మరీ లాఠిఛార్జి చేసి అనేకమందిని గాయపర్చారు. పోలీసుల సమక్షంలో స్థానిక వైసిసి కార్యకర్తలు బెంగాలీ కార్మికులపై దాడిచేసి వలస కూలీలను గాయపర్చారు. వారి ఆందోళనకు మద్దతు తెపడానికి వెళ్ళిన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నగర నేతలు బోజెడ్ల నాగేశ్వరరావు, యు.వి.రామరాజు, సిఐటియు నేత మీరావళి లను పోలీసులు అరెస్టు చేసి తోట్ల వల్లూరు పోలిస్‌ స్టేషన్‌కి తరలించారు. సిపిఐ(యం) నేత బాబూరావు అరెస్టుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, వలస కూలీను...

Tue, 2020-05-05 16:54

విజయవాడ 61 వ డివిజన్ శాంతినగర్ లో సిపిఎం అధ్వర్యంలో ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేశారు.రెడ్ జోన్ పరిధిలో ప్రజలకు కనీస సౌకర్యాలు, నిత్యవసర సరుకులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం తొమ్మిది గంటల వరకే తమకి వ్యాపారం చేసుకోడానికి అనుమతి వుందని, ప్రభుత్వం మాత్రం సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు చేస్తోందని చిరు వ్యాపారులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు

Thu, 2020-04-16 20:03

కర్నూల్ జిల్లా ఇందిరాగాంధీ నగర్ లో ఇంటింటికి కూరగాయలు ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, పి.యస్.రాధాకృష్ణ, నగర కార్యదర్శి టి.రాముడు మరియూ నాయకులు

Pages