October

రాజధానిలో ప్రజా చైతన్యయాత్ర..

ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా.. అండగా ఉండేందుకు సీపీఎం రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్మి పి.మధు డిమాండ్ చేసారు.ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రజల సంతోషాల మధ్య శంకుస్థాపనలు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించలేదని బాధలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామలు నెరవేర్చడం లేదని, గత పది నెలల నుండి పని, ఉపాధి లేదని పేర్కొన్నారు. 

APకి ప్రత్యేకహోదా కోరుతూ నిరహార దీక్షలు..

 ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు  ఎంఏ గఫూర్ విమర్శించారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

CRDA కొత్త నిబంధనలు..

ప్రభుత్వ నిర్ణయాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సిఆర్‌డిఎ విధిస్తున్న నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సిఆర్‌డిఎ పరిధిలోని 58 మండలాల్లో అగ్రికల్చర్‌ ప్రొటక్షన్‌ జోన్‌ (గ్రీన్‌బెల్ట్‌)ను ఏర్పాటు చేసి ప్రస్తుతం గ్రామంలో ఇళ్లున్న ప్రాంతానికి 500 మీటర్లలోపు దూరంలోని లే అవుట్లకు మాత్రమే అనుమతి ఇస్తామని సిఆర్‌డిఎ చెబుతోంది. దీంతో గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో రైతుల పొలాలకు విలువ తగ్గిపోతోంది.

TDPదుర్మాగాన్నిఖండించాలి:మధు

భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద ఎత్తున్న బలగాలను దించి రైతులను భయబ్రాంతులను గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లక్షలాది ఎకరాలు తీసుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ఖండించాలని మధు పేర్కొన్నారు.

ప్రైవేటు పేరుతో దోపిడీ:CITU

 ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ప్రభుత్వ విధానాల కారణంగా ఏర్పడు తున్న సమస్యలపై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని సిఐటియు కార్యాల యంలో ఆదివారం పబ్లిక్‌ సెక్టర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యాన ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలను ఎలా ప్రతి ఘటించాలన్న అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేమి, ప్రయివేటీకరణ ముప్పు వంటి కారణాల వల్ల భవిష్యత్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

తెలంగాణ ప్లీనంకు ఏచూరి..

ఈ నెల 25, 26, 27 తేదీల్లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో సిపిఎం రాష్ట్ర ప్లీనం సమావేశాలు నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ప్లీనం జయప్రదం కోసం ఆదివారం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగిన తొమ్మిది నెలల తర్వాత జిల్లాలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సమావేశాల్లో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీ నిర్మాణం, రాజకీయ చైతన్యం వంటి అంశాలపైనా చర్చిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

చట్ట సవరణతో బానిసత్వమే:గఫూర్

కేంద్రం సవరించిన చట్టాలు అమల్లోకి వస్తే కార్మికులు బానిసత్వంలో కూరుకుపోతారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులనుప్రభుత్వాలు కాలరాస్తు న్నాయని విమర్శించారు. కేంద్రం 5 కార్మిక చట్టాలు చేసింద న్నారు. సమ్మెలు నిషేధించడం, యాజమాన్యానికి అనుకూ లంగా పనిచేయడం, యూని యన్లు పెట్టకుండా నిరోధి ంచడం వంటివి అందులో ప్రధానమైనవని అన్నారు.

ఈనెల 8నుండి సిపిఎం పాదయత్ర..

విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. 

బిజెపి అండతోనే బెంగాల్ లో తృణమూల్‌ అరాచకం

కేంద్రంలోని మతోన్మాద బిజెపి అండతోనే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ అరాచక పాలన సాగిస్తున్నారని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలపై అక్కడి పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు సాగిస్తున్న దాడిని నిరసిస్తూ బీసెంట్‌ రోడ్డులోని మహంతి మార్కెట్‌ సెంటర్లో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నేతృత్వం వహించింది. తొలుత సిపిఎం కార్యాలయమైన సుందరయ్య భవన్‌ నుండి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Pages

Subscribe to RSS - October