ఆర్టికల్స్

భారత పత్రికారంగం భవిష్యత్తేమిటి?

             అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్‌ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్‌ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది. పాఠకుల ప్రవర్తనలోనూ, వార్తలను స్వీకరించే తీరులోనూ పెనుమార్పులు వస్తున్నాయి. వెబ్‌, మొబైల్‌ వేదికలు వేగాన్ని...

రాజకీయ దురహంకారం..

         మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం? ఏ అహంకారాల అభిజాత్యాల జాతరలో కొట్టుకుపోతున్నాం? మనం చూస్తున్నదంతా నిజమేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమకపడతాం. నిజమే గాంధీజీలాంటి మహానుభావుల, బుద్ధుడు, క్రీస్తులాంటి వారి పునరుత్థానం కూడా జనంలో ఇంత ఆనందాతిశయాన్ని రేకెత్తిస్తుందో, లేదో అనుమానమే. జైలు నుంచి మన నాయకుల పునరుత్థానం మాత్రం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్సవంగా మారిపోయింది. పునరపి జైలు.. పునరపి బెయిలు.. ఇది అవినీతి భారత పొలిటికల్‌ స్టయిలు...

రాజీలేని తీర్పు..

అత్యాచార కేసుల్లో ఎటువంటి మధ్యవర్తిత్వానికి, రాజీకి తావు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇవి అపరాధ రుసుముతో చెల్లిపోయేంత స్వల్ప నేరాలు కావనీ, ఏమాత్రం మెతక వైఖరి అవలంబించడానికి ఆస్కారం లేనివనీ కింది కోర్టులకు సుప్రీం స్పష్టం చేయడం అభినందనీయం. మైనర్‌ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చేసిన సంచలన తీర్పు అది. కన్నూ మిన్నూ కానక ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన నిందితుడు ఆమె తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకునేందుకు సిద్ధపడడంతో హైకోర్టు అతనికి శిక్ష తగ్గించి విడుదల చేసేందుకు సిద్ధం కావడంతో సుప్రీంకోర్టు కలగజేసుకొని న్యాయస్థానాలకు...

రుణ ఘోష..

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు? ఎప్పుడో ఏడాది కింద ఇచ్చిన హామీ జనానికి గుర్తుండదని కాబోలు ముఖ్యమంత్రి 2015-16లో రూ.1,25,748 కోట్లతో మరోసారి వంచించే...

ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.
               అమానుషమైన అత్యవసర పరిస్థితి 40వ వార్షికోత్సవం చరిత్రను వక్రీకరించాలని, దానికి వ్యతిరేకంగా సాగిన ప్రజల ఉమ్మడి...

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన...

మార్గదర్శి కొరటాల..

               భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యన్నారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్‌, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అసమానమైనది. లంకభూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద...

సంక్షోభంపై హెచ్చరిక

             ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, పరిణామాలనూ 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిణామాలతో పోల్చుతూ.. ఇటీవల లండన్‌ బిజినెస్‌ స్కూలులో జరిగిన సదస్సులో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్‌ రఘురాం రాజన్‌ చేసిన ప్రసంగం సంచలనాన్నే సృష్టించింది. జాగ్రత్త వహించకపోతే 1930 నాటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక సలహాదారుగానూ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశ రిజర్వు బ్యాంక్‌కు గవర్నర్‌గానూ ఉన్న వ్యక్తి చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా విలువ ఉంటుంది. రఘురాం రాజన్‌ వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ వర్గాల్లోనూ, బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తల్లోనూ అటువంటి ప్రభావాన్నే కలుగజేశాయి. ఇప్పటి వరకూ ప్రధానమైన...

గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నిరసన

ఏథెన్స్‌: గ్రీస్‌లోని సిరియా-ఎనెల్‌ ప్రభుత్వం అమ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు, అంత ర్జాతీయ ఆర్థిక సంస్థలతో చేసు కుంటున్న ఒప్పం దాలకు వ్యతిరేకంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) దేశంలోని వివిధ నగరాలలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఏథెన్స్‌ సెంట్రల్‌ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో ఆందోళనకారులనుద్దేశించి కెకెఇ ప్రధాన కార్యదర్శి డి.కౌట్సుంపాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలకు, దివాలాకోరు ఆర్థిక విధానాలకు, ఐరోపా కూటమి కేపిటలిస్ట్‌ అధికారానికి తలవంచే పార్టీలకు 'నో' చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కెకెఇతో కలిసి ఉద్యమించాలని ఆయన కోరారు....

గ్రీస్‌ సంక్షోభం

గ్రీస్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐరోపా యూనియన్‌(ఇయు), యూరపు సెంట్రల్‌ బ్యాంకు (ఇసిబి), అంతర్జాతీయ ద్రవ్యనిధిó త్రయం గ్రీస్‌ ఆర్థిక రోగానికి ఇచ్చిన మందు వికటించి ఆ దేశాన్ని మరింత తీవ్రమైన రోగానికి గురిచేయగా ప్రపంచీకరణ యుగంలో దాని జబ్బు ఇప్పుడు యూరప్‌కూ, ఇతర దేశాలకూ పాకుతోంది. దుష్ట త్రయంగా గ్రీకు ప్రజలు పిలుస్తున్న ఈ మూడు ద్రవ్య సంస్థలు గ్రీకు బ్యాంకులకిచ్చే రుణాలపై పరిమితులు విధించడంతో ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సంక్షోభానికి మూలాలు యూరపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. దానికి మూలాలు 2008లో అమెరికాలో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని జర్మనీ, ఫ్రాన్స్...

అవినీతి రొచ్చులో బిజెపి

          'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్‌, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు. ఈ ఉదంతాలకు స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం తోడై ముచ్చెమటలు పోయిస్తున్నది. ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని, బిజెపి అగ్ర నేతలు...

పడకేసిన ప్రాథమిక వైద్యం

                   మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్‌ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్‌ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్‌ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్‌ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులలో శవాల మీద కూడా...

Pages