September

బిజెపిని బలపరచడం మానుకోండి-వైసిపి, టిడిపి, జనసేనలకు బి.వి రాఘవులు సూచన

సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం ప్రారంభం
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ

మోడీ మళ్లీ వస్తే చీకటి రాజ్యమే

 మోడీ మళ్లీ అధికారంలోకొస్తే దేశం చీకటి రాజ్యంగా మారనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మోడీని గద్దె దించడానికి ఇండియా పేరుతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన పార్టీ... బిజెపి పల్లకి మోయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన గత నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమరభేరి సోమవారం ముగిసింది. చివరి రోజు ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు.

ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభకాంక్షలు

 ప్రభుత్వ విద్యాలయాలలో పేద విద్యార్థులను నాణ్యంగా తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయ లోకం చేస్తున్న కృషిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వల్ల నేడు విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని పేర్కొన్నారు. దీనిస్థానంలో శాస్త్రీయ విద్యా విధానం రావాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య నందించాలని కోరారు.

శాసనసభలో ప్రవేశపెట్టిన మధ్యంతర నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్పందించాలి. సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

Pages

Subscribe to RSS - September