September

ముసుగు తొలగిన చంద్రబాబు..

''ఎట్‌ లాస్ట్‌ ది క్యాట్‌ ఈజ్‌ అవుట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌'' అనేది ఆంగ్ల సామెత. '' పిల్లి చివరికి సంచిలో నుంచి బయటపడింది'', అని దీని అర్థం. నిరంతరం అబద్ధాలు చెబుతూ, ఎదుటి వారిని మోసం చేస్తూ బతికేవారి నిజస్వరూపం బట్టబయలైనప్పుడు ఈ సామెతను ఉదహరి స్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సామెత అతికి నట్లు సరిపో తుంది. రాజధాని భూ సమీకరణకు సంబంధిం చి నిన్నటి వరకు ఆయన చెప్పిన మాటలు, నిన్న చేసిన ప్రకటన చూస్తే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో స్పష్టమౌతున్నది.

ఐరాస లక్ష్యాలు నెరవేరెేనా..

 వచ్చే పదిహేనేళ్లలో ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) లక్ష్యం మంచిదే కానీ దేశాల చిత్తశుద్ధి, సమిష్టి కార్యాచరణ పైనే అనుమానం. దశాబ్దంన్నర క్రితం 2000 సంవత్సరంలో ఐరాస తీసుకున్న సహస్రాబ్ది లక్ష్యాల్లో చాలా మట్టుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఐరాస టార్గెట్లను అమెరికా ఇతర పశ్చిమ దేశాలు తుంగలో తొక్కి తమ స్వంత ఎజెండాతో మున్ముందుకెళుతున్నప్పుడు ఎన్ని నూతన ఎజెండాలు రూపొందించినా ఆశించిన మార్పు రాదన్నది స్పష్టం. అందుకే పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాజాగా ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామకంఠాల సమస్యకు పరిష్కారం ఎపుడో..

గ్రామకంఠాల సమస్యలను వారంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావించినా నెల దాటిపోయింది. గత నెల 20వ తేదీన భూ సేకరణ ప్రకటన విడుదల చేశారు. వెంటనే వరసుగా గ్రామాల్లో సిఆర్‌డిఏకు అవసరమైన భూముల తుది జాబితాలను 9.5 ఫారం రూపంలో అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా గ్రామాల్లో కలకలం చెలరేగింది. రైతులు సిఆర్‌డిఏ కార్యాలయాలను ముట్టడించారు. కొన్ని చోట్ల తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు శిక్షణలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ఆఘమేఘాలపై పిలిపించారు. గత నెల 24 నుంచి ఈ సమస్యపై ఆయన దృష్టి సారించారు.

చిరస్మరణీయుడు జాఘవా:గఫూర్‌

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు.

నష్టపరిహారం ఏది..?:గంగారావు

గంగవరం పోర్టు యాజమాన్య నిరంకుశత్వానికి సోమవారం ఓ కార్మికుడు మృతి చెందాడు. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజారావు(40) పోర్టులో అగ్రికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పోర్టుకు కిలోమీటరు దూరంలో రాజారావుకు సంబంధం లేని గోతులు తవ్వే పనిని యాజమాన్యం అప్పగించింది. పని ప్రదేశంలో మంచినీరు కూడా లేదు. పనిచేస్తుండగా రాజారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతిచెందిన రాజారావును చికిత్స పేరుతో దొడ్డిదారిన మల్కాపురంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు.

రైతులకు అండగా..:కృష్ణమూర్తి

భోగాపురంలోని ఎయిర్‌ పోర్టు బాధిత రైతులను, ప్రజలను మోసగించే ధోరణిని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా మండలం లోని కౌలువాడలో రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ పరిశ్రమల పేరుతో తీసుకున్న భూముల్లో ఎక్కడా పరిశ్రమలను స్థాపించలేదన్నారు. బాధితుల ఆందోళనను, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, ఆగస్టు 31న అర్ధరాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

హోదాపై జీపుజాతా:రాంభూపాల్‌

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీపుజాతాను ప్రారంభించారు. తొలిరోజు రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో జాపుజాతా పర్యటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎనిమిదేళ్లుగా తీవ్ర కరువు నెలకొందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట దీక్ష

రాజధాని శంకుస్థాపన కోసం రూ. 50 కోట్లు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రికి అసైన్డ్‌, సీలింగ్‌ భూముల సాగుదారుల ఆకలికేకలు వినిపించడం లేదా అని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రశ్నించారు. బాధితులకు కౌలుచెక్కుల చెల్లింపుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో అసైన్డ్‌, సీలింగ్‌ సాగుదారుల దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. రాజధాని ప్రాంత పేదల సమస్యలు పరిష్కరించకుండా తీవ్రమైన అణచివేతకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్‌ నుండి ఇవ్వాల్సిన పెన్షన్‌ ఇవ్వకుండా విచారణ పేరుతో లబ్ధిదారులను కుదించడం అన్యాయమన్నారు.

సాయినార్‌ ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకోవాలి. మృతిచెందిన ఒక్కొక్కరికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు (28-9-2015)న మధ్యాహ్నాం పరవాడ జవహర్‌లాల్‌ ఫార్మాసిటీలో సాయినార్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా, మరో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన క్షతగాత్రులను విశాఖలోని న్యూ కేర్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్, అధ్యక్షులు జి.కోటేశ్వరరావు.

మత సమరస్యంనికి భంగం కలిగిస్తున బి జె పి వైకరిని ఖండిచండి సి పి యం , సి పి ఐ సమావేశం

మత సమరస్యంనికి  భంగం కలిగించే రీతి లో  బి జె పి మరియు అనుబంధ  సంస్తలు  స్సగిస్తున అప్రజాస్వామిక  ధోరణలు జిల్లా ప్రజలు నిరిసించాలని సి పి యం , సి పి ఐ నాయకులూ  కోరుతు   బి జె పి వైకరిని సి పి యం , సి పి ఐ లు  ఖండిచాయ్.  బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లిమ్స్   వారి వస్త్ర దారణ , ఆహారపు అలవాట్లు , సంస్కృతి విషయం లో జోక్యం చేసుకోవడం , వారిని రెచ్చ గోటడం లాటివి మత సామరస్యంనికి బంగం కలిగిస్తుదని  కావున  ఇలాంటి చర్యలు జరగా కుండ చూడాలని వారు ప్రభుత్వాని డిమాండ్ చేసారు.  

Pages

Subscribe to RSS - September