September

ప్రైవేటుకు ప్రభుత్వాస్పత్రులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ ఆగస్టు 8 సమావేశంలో వైద్య విద్య సమీక్ష పేరుతో ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని 'ఆపోలో'కు అప్ప గించిన విధంగానే ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్య కళాశాలలకు అప్పగించడం దుర్మార్గం. ఇది జాతి సంపదను ప్రైవేటు వారికి అప్పగించడమే. సుమారు రూ.1,000 కోట్ల విలువ చేసే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలను అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వమైనా ప్రజా సంపదను కాపాడాలి తప్ప హరించడం అన్యాయం.

టీచర్‌పోస్టులుభర్తీచేయాలి:DYFI

డిఎస్‌సి -2014 ఫలితాలపై ప్రభుత్వం వెంటనే మెరిట్‌ లిస్టు ప్రకటించి టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మాధవ్‌, ఎం.సూర్యారావు ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట ఉన్న ఉపాధ్యాయులతోనే సరిపెట్టి, మిగిలిన వారిని వేరే శాఖలో నియమిస్తామని చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్వాలిఫెడ్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉమారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరిట్‌ లిస్టు ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

కరువు కోరల్లో కర్నూల్..

జిల్లాలో వర్షాభావ పరి స్థితుల వల్ల వ్యవసాయం దెబ్బ తిందని, ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కరువు పరిస్థితి నెలకొంటే ముఖ్య మంత్రి విదేశీ పర్యటలకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని అన్నారు. వేల, కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చేపట్టిన హంద్రీనీవా పనుల్లో మామూళ్ల కోసం నాణ్యతను పట్టించు కోకుండా నాసిరకంగా నిర్మాణం చేపటా ్టరన్నారు.

మక్కాలో 700మంది పైగా మృతి

మక్కాలో మహా విషాదం చోటు చేసుకుంది. హజ్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 700 మందికిపైగా మరణించారు. చివరిరి అంకమైన 'జమారత్‌'కోసం మక్కాకు సమీపంలోని'మీనా' (సైతాన్‌ శిల) వద్దకు చేరుకున్న వేలాది మంది యాత్రికులు గురువారం తొక్కిసలాటకు గురి కావటంతో దాదాపు 715 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య 800 మందికి పైగానే వుంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రైతు క్షోభ పట్టని సర్కారు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా వాటిని ఏలికలు అలవోకగా తీసుకోవడం దుర్మార్గం. అన్నపూర్ణగా అభివ ర్ణించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల బలవన్మరణాలు మరింత ఆందోళన కరం. రాయలసీమలో సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 32 మంది కర్షకులు విధి లేని పరిస్థితుల్లో మరణాన్ని ఆశ్రయించినా ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం సైతం లేకపోవడం దారుణం. సీమలో రైతు ఇంట చావు డప్పు ఇప్పటికిప్పుడు తలెత్తిన ఉత్పాతం కాదు. దశాబ్దంన్నర నుంచీ పరంపర కొనసాగుతూనే ఉంది. టిడిపి, కాంగ్రెస్‌, మళ్లీ టిడిపి పాలక పార్టీలు మారాయి తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు సరి కదా అంతకంతకూ దిగజారుతున్నాయి.

నిర్మాణ పనులన్నీ గోప్యం..!

రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు.

మాన్సాస్‌కు కట్టబెట్టొద్దు:CPM

 జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రిని ప్రయివేటు సంస్థ మాన్సాస్‌కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం ధర్నా చేశారు. ఆసుపత్రి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి లేని జి ల్లా విజయనగరమేనన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు కూడా జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారని తెలిపారు.

భూసేకరణను అడ్డుకుంటాం..

ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు పాలించాలా? శాసించాలా?

''మానవుడు స్వేచ్ఛగా జన్మించి తర్వాత సంకెళ్ళలో బంధింపబడతాడు'' అని ఓ తత్వవేత్త ఉడ్రోవిల్సన్‌ అంటాడు. ఇది నేటికీ నిజమే! స్వేచ్ఛాయుతమైన జీవనం గడిపేందుకు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ అంటే ఎదుటి వారికి హాని కలిగించని ఏ పనైనా చేసుకునే వెసులుబాటు అని చిన్నప్పుడు మాస్టారు చెప్పారు. ఇప్పుడది అర్థం మారి ప్రభుత్వం చెప్పినట్టు వింటేనే స్వేచ్ఛ, లేదంటే ధిక్కారం అంటున్నారు. రాజ్యం ఏర్పడింది సమాజ శ్రేయస్సుకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మాత్రమే. ప్రభుత్వాలు ఏర్పరచుకున్నది ప్రజలను పాలించడానికే కానీ శాసించడానికి కాదు. పాలించడం, శాసించడం మధ్య చాలా వ్యత్యాసముంది.

Pages

Subscribe to RSS - September