September

స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనోద్యమాలు..

ఆదివాసీలు అనాదిగా సభ్యసమాజ సంస్కృతికి, నవనాగరికతకు నాంది. కానీ నేడు ఈ పాశ్చాత్య పోకడల ప్రపంచములో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో పంచవర్షప్రణాళికలు వచ్చినా ఇప్పటి వరకు దేశంలో అనేక ప్రాంతాల ఆదివాసీల అభివృద్ధి అగమ్యగోచరంగానే ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 వసంతాలు నిండుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు అందనంత దూరంలో ఆదివాసీ పల్లె ప్రజలున్నారనడంలో సందేహం లేదు.

విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందా?

విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం, రాష్ట్రం వేగంగా అభివృది ్ధచెందుతుందని కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు నోట తరచూ వినిపిస్తున్నది. ఇది వాస్త వమా..? ఇదే నిజమైతే ఇప్పటికే మన దేశంలో 448 విమానాశ్రయాలున్నాయి. దేశం ఎంత అభివృద్ధి చెంది ఉండాలి? ప్రజల జీవన ప్రమాణం ఎంత మెరుగుపడి ఉండాలి? అసలు విమానాశ్రయాలు నిర్మిస్తే దేశం అభివృద్ధి చెందినట్లా..? లేక విమానాల్లో ప్రయాణించ గలిగే ఆర్థిక స్తోమత ప్రజలకు కలిగిస్తే దేశం అభివృద్ధిచెందినట్లా..? అన్నది పాలకులు ఆలోచించాలి. ఇటీవల కేంద్ర పౌర విమాన యాన శాఖ వెలువరించిన నివేదికను పరిశీలి స్తే..

కార్పొరేట్‌ అనుకూల విధానాల్లో టిడిపి ప్రభుత్వ ముందంజ

కార్పొరేట్‌ కంపెనీలు సులు వుగా వ్యాపారం చేసుకునే అవకా శాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ అవకాశాలు కల్పించడానికి అవసర మైన సంస్కరణలు అమలు చేస్తున్న క్రమంలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయో జనాలు సమిధలవుతున్నాయి. కార్పొరేట్‌ అనుకూల సంస్కరణల అమలులో బిజెపి, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల అమలు బాగా స్పీడందుకుంది. ప్రపంచ బ్యాంకుతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకున్న బంధం దీనికి తోడయింది.

భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయరాదు..

విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్‌. పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి. నేటి యువతకు ఆదర్శప్రాయుడే కాకుండా రోల్‌ మోడల్‌. ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలి. సువిశాల భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈ యువకిశోరం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారు. దేశాన్ని ఉత్తేజింపజేశారు.

వికృత రూపాల్లో మతవాద దాడి..

శుక్రవారం నాడు బిజెపి కేంద్ర మంత్రులు చాలా అట్టహాసంగా నెహ్రూ మ్యూజియం లైబ్రరీలో విజయోత్సవం జరుపుకొన్నారు. అంతకు ముందు దానికి డైరెక్టరుగా ఉన్న మహేష్‌ రంగరాజన్‌ను వదిలించుకున్న సంతోషమది. ఆ ఊపులో మాజీ జనసంఘం అధ్యక్షుడైన దీన దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు ప్రకటించడమే గాక ఆయన సిద్ధాంతంగా చలామణిలో ఉన్న సమగ్ర మానవతావాదం(ఇంటిగ్రల్‌ హ్యూమనిజం)పై పరిశోధన జరగాలని ప్రకటించారు. సరిగ్గా అదే రోజున వెంకయ్య నాయుడు హైదరాబాదులో దీనదయాళ్‌పై ఒక పుస్తకం విడుదల చేస్తూ కమ్యూనిజం విఫల మైందని, దేశంలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీలకు స్థానం లేకుండా పోయిందని ప్రకటించారు. ''బెంగాల్‌ కంచుకోట బద్దలై పోయింది.

శరణార్థుల సమస్యకు కారణమేంటి?

 ఐరోపా నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరణార్థులు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం తరువాత ఇంత పెద్దయెత్తున ఈ సంక్షోభం ముందుకు రావడం ఇదే మొదటిసారి. సిరియాపై నాటో కూటమి బాంబు దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ముందుకొచ్చింది. వేలు, లక్షల సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రస్తుత దుస్థితికి కారణం సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఆ దేశంపై దండెత్తిన నాటో దేశాల కుట్రపూరిత విధానమే కారణం. నాటో కూటమి మధ్య ప్రాచ్యంలోని తన అరబ్‌ మిత్రదేశాలతో కలిసి సిరియాపై యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో లక్షలాది మంది సిరియన్‌ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు.

పెరుగుతున్నధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రభుత్వా ధికారులు విశ్లేషణలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ ధరల సూచి 2014 జులై కన్నా 2015 జులైలో 4.05 శాతం తక్కువగా నమోదయిందని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవ చ్చునని, కాబట్టి ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు డిమాండు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వు బ్యాంక్‌ ఈ నెల 17-18 తేదీలలో జరిగే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భగత్‌ విప్లవ వీరుడు:మిడియం

 భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమస్యలపై విద్యార్థులు ఉద్యమాల్లో ముందుండాలని మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్‌ 108వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎజిహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కారం నాగేశ్వరావు అధ్యక్షతన ఆదివారం సభ జరిగింది. మిడియం మాట్లాడుతూ నాడు భారతదేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యువకిషోరం భగత్‌సింగ్‌ అని ఆయన కొనియాడారు. యువకుల్లో విప్లవాన్ని రగిలించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వెరవకుండా తీవ్రమైన పోరాటాన్ని నడిపించారని. 1907లో జన్మించిన భగత్‌సింగ్‌ భరతమాత విముక్తే ధ్యేయంగా 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడారని చెప్పారు.

Pages

Subscribe to RSS - September