September

ప్రమాదంలో ప్రభుత్వ విద్య: SFI

ప్రభుత్వ విద్యారంగాన్ని నూతన విద్యాసంస్కరణల పేరుతో టిడిపి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 రోజులపాటు నిర్వహించిన 'విద్యాపరిరక్షణ సైకిల్‌యాత్ర' ముగింపు సభ ఆదివారం స్థానిక జగన్నాథపురం చర్చిస్క్వేర్‌ వద్ద జరిగింది. సభలో రాము మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. నూతన సంస్కరణల పేరుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని విమర్శించారు.

గిరిజనులకు ఉచిత వైద్యపరీక్షలు..

 చింతూరు మండలంలో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యశిబిరంలో ఆదివారం 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురిని మలేరియా బాధితులుగా గుర్తించారు. ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 100 మంది వైద్యశిబిరానికి వచ్చారు. వారిలో ఐదుగురు మలేరియా బాధితులు ఉన్నారని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు తెలిపారు.రోజురోజుకూ వైద్యశిబిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, వారందరికీ తగిన వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.

 

ఇంటికే ఉద్యోగం మరో మోసం:DYFI

ప్రజల వద్దకే ఉద్యోగం అని సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించడం మరో మోసమని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. సూర్యారావు విమర్శించారు. ఈ మేరకు ఇంటికే ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు డివైఎఫ్‌ఐ బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులను ముందుగా భర్తీ చేయాలని సూర్యారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి ఆలయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్తియ అభియాన్‌ కింద మన రాష్ట్రానికి 752 ఉద్యోగాలు కేటాయించిందన్నారు.

పుస్తకావిష్కరణ చేసిన మధు..

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ "భూబ్యాంక్ బండారం..కార్పోరేట్లకు పందేరం" అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమక్ష్యంలో విడుదలచేసారు.

సిపిఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు

ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు.ఏపీకి 'భిక్షం' మాదిరిగా కేంద్రం అరకొర నిధులు కేటాయిస్తే వాటికోసం చంద్రబాబునాయుడు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి పేరుతో భూదందా:CPM

అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూ దందా నిర్వహిస్తోందని, ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన వేల ఎకరాలు భూములు ప్రయివేటు వ్యక్తులకు, విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. స్థానిక టీచర్స్‌ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ హాల్లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిపిఎం డివిజన్‌ సెక్రటేరియట్‌ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతురావు అధ్యక్షత వహించారు. ఇందులో పలువురు మేధావులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు క్రీడా కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు దీనిపై మాట్లాడారు.

ప్రభుత్వాలదే భాద్యత:AIKS

ప్రభుత్వ విధానల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అభిప్రాయపడింది. అఖిల భారత చెరకు రైతుల సంఘం తొలి మహాసభ తమిళనాడులోని ముధురై పట్టణంలో ఆదివారం ప్రారంభమైంది.  ఈ సందర్భంగా విజ్జూక్రిష్ణన్‌ మాట్లాడుతూ ప్రపం చంలో బ్రెజిల్‌ తర్వాత చెరకు ఉత్పత్తిలో ఇండియాదే రెండో స్థానమ న్నారు. చక్కెర వినియోగంలోనూ అదేస్థానంలో ఉన్నామన్నారు. అధికారంలోకి వస్తే చెరకు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి ధర నిర్ణయిస్తామన్న మోడీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంలో విఫల మైందన్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ప్రభుత్వ విధానల వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

జాషువా 120వ జయంతి వేడుకలు

కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా రచనలపై మరోసారి అధ్యయనం జరగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా ఆదివారం ఎసి కళాశాలలో 'జాషువా సమగ్ర రచనలు - సమాలోచన' అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సుల్లో సాహితీ వేత్తలు, అభ్యుదయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె యస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. సభలో దళిత తత్వవేత్త డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ..

రాజధాని మాస్టర్‌ప్లానంతా బూటకం..

రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్‌ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు విమర్శించారు.విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్‌డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. గ్రీన్‌ బెల్డ్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు.

Pages

Subscribe to RSS - September