భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 జనవరి, 2025.
భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం
ప్రయాగరాజ్ ఘటనపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహా కుంభమేళా తొక్కిసలాటలో 20 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.