September

సిపిఎం ఆధ్వర్యాన గిరిజనుల భూపోరాటం..

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గిరిజనులు మంగళవారం భూ పోరాటం చేశారు. సిపిఎం ఆధ్వర్యాన 60 ఎకరాల సీలింగ్‌ భూముల్లో జెండాలు పాతారు. ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 

బిజెపివి విచ్ఛిన్నరాజకీయాలు..

సోమవారం సిపిఎం నేత హరికిషన్‌సింగ్‌ సూర్జీత్‌ 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీి అధికారంలోకి వచ్చాక బిజెపి ప్రజల్ని కుల, మత ప్రాతిపదికన విడగొట్టి పబ్బం గడుపుకొంటుందనీ ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థికవిధానాల ఫలితంగా పేద,ధనిక వర్గాల మధ్య అంతరం రోజురోజుకి పెరిగి పోతుందన్నారు.భారత్‌లో సుమారు 90 శాతం కుటుంబాలు నెలకు కేవలం పది వేలు మాత్రమే సంపాది స్తున్నాయని, అదే సమయంలో ఒక వంద కుటుంబాల ఆదాయం దేశ జిడిపిలో సగానికి పైగా ఉంటుందనీ ఆయన తెలిపారు. 

హిందూత్వ వెనుక కుల వైరస్‌

హిందూ జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? ప్రధానికి సంబంధించినంత వరకు ఇది నిరర్థకమైన ప్రశ్న కాదు. మరో కారణం రీత్యా ఇదొక నిరర్థకమైన ప్రశ్న. రాజ్యాగాన్ని అనుసరించి భారతదేశం ఎన్నటికీ హిందూ దేశం కాబోదు. ఒక జాతి రాజ్యంగా ఇది రాజకీయంగా మతంతో ఎలాంటి సంబంధంలేనిదిగా ఉండి తీరాలి. ఇదే ప్రశ్నను మరో రకంగా కూడా చెప్పవచ్చు. లౌకికవాద ''భారతీయ'' జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? గీతా ప్రెస్‌ ప్రచురణలననుసరించి గట్టిగా 'కాదు' అనే వస్తుంది. వారి సిద్ధాంతం హిందూ జాతీయవాదం. వారి లక్ష్యం హిందూ భారతదేశం.

ప్రకాశం జిల్లా కమిటి సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు

‘లాజిస్టిక్‌ హబ్‌’ భూ సాగుదార్లకు నష్టపరిహారం పెంచాలి. కూలీలకు, వృత్తిదార్లకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి.- సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు సాగుదార్లను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్‌ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, వల్లూరు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును సేకరిస్తున్నారు. 

పింఛన్లు ఇవ్వాలని CRDA వద్ద ధర్నా

రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు.

సనాతన్‌ సంస్థపై నిషేధం..

సామాజిక ఉద్యమకారులు, హేతు వాదులు, రచయితలపై దాడులకు పాల్పడుతున్న హిందూ అతివాద సనాతన్‌ సంస్థపై నిషేధం విధిం చాలని పలు రాజకీయ డిమాండ్‌ చేశాయి. సిపిఐ నేత,రచయిత గోవింద్‌ పన్సారే హత్య కేసులో నిందితుడైన సమీర్‌ గైక్వాడ్‌తోపాటు సనాతన్‌ సంస్థకు చెందిన మరికొందరు ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఐతే,నిందితులకు ఆ సంస్థతో సంబంధాలు న్నట్టు రుజువులు సాధించకుండా నిషేధం విధించాలని కేంద్రానికి ప్రతిపాదన పంపలేమని మహారాష్ట్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

అన్నిశాఖలపై ప్రపంచబ్యాంకు పెత్తనానికి యత్నం..

 ప్రపంచ బ్యాంకు ఈ నెల 14న 'అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1-జూన్‌ 30 మధ్య పారిశ్రామిక, వ్యాపార సంస్కరణలకు సంబం ధించి 98 అంశాలను మదింపు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ కీలక పాత్ర పోషించి రూపొం దించిన ఈ నివేదిక రూపకల్పనలో మేక్‌ ఇన్‌ ఇండియా, కెపియంజి, సిఐఐ, ఫిక్కీ ఉన్నాయి. ఇందుకు 285 ప్రశ్నలను రూపొందించి, వాటికి ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాధా నాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ర్యాంకులు నిర్ణయిం చినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రశ్నలలో కార్మిక చట్టాల నియంత్రణకు సంబంధించినవి 51 కాగా, మరో 61 తనిఖీలకు సంబంధించినవి.

Pages

Subscribe to RSS - September