అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది.