September

భ్రమ-వాస్తవం

తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం.

ప్రభుత్వ భూదందా సాగదు:రఘు

పారిశ్రామిక అభివృద్ధికే భూసమీకరణ అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టును అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున భూములు లాక్కొంటోందన్నారు. అక్కడ వేలాది ఎకరాలను దశాబ్దాల తరబడి స్థానికులు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూదందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టిడిపి, కారగ్రెస్‌ నేతలపై జరిగిన తిరుగుబాటే దీనిని నిదర్శనమన్నారు.

TDP మట్టిమాఫియా:దడాల

అధికార పార్టీ నాయకులు, మట్టిమాఫియా, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రామేశంపేట మెట్ట భూమిలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. రామేశంపేట మెట్ట భూముల దళిత రైతులు సిపిఎం ఆధ్వర్యాన పెద్దాపురం తహశీల్దార్‌, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల మాట్లాడుతూ దళితులకు ఉపాధి నిమిత్తం ఇచ్చిన అసైన్డ్‌ భూములను 9/77 యాక్టు ప్రకారం అమ్మకాలుగానీ, కొనుగోళ్లు గానీ చేయకూడదన్నారు. జిఒ 2/2013ను చూపించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

ఆశావర్కర్లకి అండగా సిపిఎం

పెండింగ్‌ వేతనాలు, పారితోషకాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు తూర్పుగోదావరి జిల్లా చింతూరు రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంఎల్‌ఎ, ఎంపీల ఇంటి అద్దె అలవెన్సు పెంచుతున్న ప్రభుత్వం తక్కువ వేతనంతో కాలం వెళ్లదీస్తున్న ఆశాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ముంపు మండలాల కార్మికుల సంక్షేమం పై శద్ధ చూపడంలేదన్నారు. తహశీల్దార్‌ శివకుమార్‌ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు.

SFI నిరసనల వెల్లువ..

విశాఖ కలెక్టరేట్‌ వద్ద సమస్యలపై శాంతియుతంగా మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు నిర్వహిం చారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా ఎప్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఐటిడిఏ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఎస్‌ఐ సూర్యప్రకాశరావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అప్పారావును అరెస్టు చేశారు. అరకువేలీ, నర్సీపట్నంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.

రాజధానిలో 144 సెక్షన్ విధించటం పౌరుల హక్కులను ఉల్లంగించటమె.

సిపియం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్భంధం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో సిపియం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం శంఖుస్థాపన జరగక ముందే అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందన్నారు. ఇది రాజధాని సమస్య కాదని పౌర హక్కుల సమస్యని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1.10 లక్షల ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనీ, కానీ మాస్టర్ ప్లాన్ లో మాత్రం అన్ని కార్యాలయాలకు కలిపి 155 ఎకరాలు సరిపోతుందని చూపిస్తున్నారని, మిగిలిన భుమూల్ని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

జనం స్పందన చూసైనా స్పృహలోకి వస్తారా!

సెప్టెంబర్‌ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.

థర్మల్ పవర్ బాధితులకు అండగా..

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు.

ప్రశ్నిస్తేనే..!

న్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం అంటాడు కబీరు. మంచి మనిషిగా బతకడమంటే మౌనంగా తన దారిన తాను బతకడం కాదు. తన కళ్ళెదుటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటం కాదు. తానొవ్వక, నొప్పింపక, తప్పించుకు తిరిగే లౌక్యం చూపడమూ కాదు. మాయలపేరిట, మంత్రాల పేరిట మూఢత్వంలోకి లాక్కెళ్ళే కుతంత్రాలను ప్రశ్నించాలి. మనిషికి క్షేమకరం కాని చెడు మీద తిరగబడే తత్వాన్ని ప్రదర్శించాలి. హేతువుకు నిలవని విషయాలను సవాల్‌ చేయాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి అందించాలి. తన చుట్టూ ఉన్న ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలి.

దళితుల పట్ల వివక్షా?:CPM

144 సెక్షన్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపుతున్న ప్రభుత్వ పోకడను సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం మంగళగిరిలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణను, కోస్తా జిల్లాల కన్వీనర్‌ మల్లవరపు నాగయ్య తదితర నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు.

Pages

Subscribe to RSS - September