September

14 FDIలకు ఆమోదం..

వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు సంబంధించి 14 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదముద్ర వేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికంఠదాస్‌ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఎఫ్‌డిఐలకు సంబంధించిన 23 ప్రతిపాదనలను పరిశీలించిన బోర్డు నాలుగు ప్రతిపాదనలను తిరస్కరించింది, ఐదింటిపై నిర్ణయం వాయిదా వేసింది. బోర్డు ఆమోదించిన ప్రతిపాదనల్లో శ్యామ్‌ సిస్టెమా టెలి సర్వీసెస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ తదితర సంస్థలకు చెందిన ప్రతిపాదనలున్నాయి.

పోర్టుకి ప్రభుత్వమే అడ్డు:CPM

బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న పోర్టు నిర్మాణ పనులకు రాత్రికిరాత్రే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసి గ్రామాల్లో అలజడి సృష్టించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించవచ్చన్న టిడిపి నాయకులు, ఇప్పుడు 30 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేశారో చెప్పాలని ప్రశ్నించారు.

రైతుల పరిస్థితి దయనీయం..

రాజధానికి భూములిచ్చిన రైతుల జీవనస్థితి మారిపోతోంది. భూములిస్తే అకాశ హర్య్మాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తదనుగుణంగా కనీస శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో వారు గేదెలు కాసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాగులేక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. తోటల్లో పిచ్చిచెట్లు మొలిచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. మాగాణుల్లో మోకాళ్ల ఎత్తున గడ్డి మొలిచింది. వాటిని చూసి రైతులు చలించిపోతున్నారు. కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించి రైతులు ఒకటీ లేదా రెండు గేదెలు కొనుగోలు చేసుకున్నారు. సాగు చేసిన పొలాల్లోనే వాటిని మేపుకొంటూ కాలం గడుపుతున్నారు.

ఉపాధిహామీ సంగతేంటి? :VSR

అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మమేకం కావాలని రైతుసంఘం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.300 వేతనం అందించాలని వర్క్‌షాప్‌ తీర్మానించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. వలసలు నివారిస్తామని, ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని చూపిస్తామని చట్టంలో పేర్కొన్నా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

మోడీ అన్నింటా విఫలం:బృందా

కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రజాసంక్షేమం సహా అన్నింటా వైఫల్యం చెందిందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపి బృందాకరత్‌ అన్నారు. ఏడాది పాలనలో ప్రజలపై ఆర్ధికభారాలు మోపడం మినహా సాధించింది ఏమీ లేదని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందన్నారు.గురువారం  హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలు మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆహారభద్రతా బిల్లు ప్రకారం నిత్యవసరవస్తువుల్ని సరఫరా చేయట్లేదని తెలిపారు. 

మొక్కుబడి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

సాగుదారులకు అండగావుంటాం: మధు

 బందరు పోర్టు భూముల ప్రభావిత గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విస్తృతంగా పర్యటించారు.భూ బ్యాంక్‌ పేరుతో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బందరు తీరంలో 30 వేల ఎకరాలు సమీకరిస్తోందని, ఇందులో 14 వేల ఎకరాల ప్రైవేటు భూములున్నట్లు చెబుతూ మిగిలిన 16 వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్న రైతులకు మొండిచెయ్యి చూపించేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. సాగుదారులకు అండగా ఉంటామని, పోరాటం చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.

ప్రభుత్వతీరు సిగ్గుచేటు:మధు

విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం నాయకులను, రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తోటపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు కింద కాల్వలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు కూడా నిర్ణయించాయని తెలిపారు.

మోడీ అచ్చేదిన్ భ్రమే: ఏచూరి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మంచి రోజులు ఒట్టి భ్రమేనని, అచ్చేదిన్‌ సూచనలే కానరావడం లేదని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. మతోన్మాద బిజెపితో పాటు కార్పొరేట్‌ సేవలో తరిస్తున్న జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌లను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. మోడీ అశ్వమేధ యాగ గుర్రాన్ని కట్టి వేయగల సత్తా బీహార్‌ ప్రజలకుందని ఏచూరి చెప్పారు. రామాయణం చివరిభాగంలో రాముడి అశ్వమేధ గుర్రాన్ని లవకుశులు నిలువరించారని, అదే విధంగా మోడీ అశ్వమేధ గుర్రాన్ని రైతులు, కార్మికులు నిలువరిస్తారని తెలిపారు.

Pages

Subscribe to RSS - September