September

LICని కాపాడుకుందాం:CITU

ఎల్‌ఐసి, ఏజెంట్ల రక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గురువారం ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన 4వ ఆలిండియా కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఐసినీ, ఏజెంట్ల వ్యవస్థనూ నిర్వీర్యం చేయడం జాతి వ్యతిరేక చర్య అని, ఈ అంశంలో కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.స్టాక్‌ మార్కెట్‌లలో పింఛన్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్మును పెట్టడాన్ని అందరూ వ్యతిరేకిం చాలన్నారు.

సామాజిక న్యాయమా? ఆధిపత్యమా?

మరోసారి రిజర్వేషన్లపై రగడ మొదలైంది. గుజరాత్‌ పటేళ్ల ఆందోళన దీన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఇది చాలా ఆందోళన కరమైన పరిణామం. తమను వెనకబడిన తరగతుల్లో చేర్చి రిజర్వేషన్లు వర్తింపజేయాలని వారు చేపట్టిన ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. ప్రధాని సొంత రాష్ట్రం అభివృద్ధికి ఆధునిక నమూనాగా చెప్పబడుతున్న గుజరాత్‌లో ఈ పరిణామం జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనంటూ మీడియా ఊహాగానాలు మొదలు పెట్టింది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీ దీనివల్ల లాభపడుతోంది? అంతిమంగా ఇది రిజర్వేషన్లను ఎత్తివేసే వైపు సాగుతుందా? పటేళ్లు నిజంగానే వెనకబడిన వారా?

కార్మికసంఘాలకు దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది.

కార్పొరేట్ల సేవలొ కేంద్ర రాష్త్ర ప్రభుత్వలు:- వి.కృష్ణయ్య

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు.

కార్పొరేట్ల సేవలొ కేంద్ర రాష్త్ర ప్రభుత్వలు:- వి.కృష్ణయ్య

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు.

మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల‌ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల‌పై విశాఖనగరంలో కార్మికుల‌ సమ్మె విజయవంతం

2015 సెప్టెంబ‌రు 2
    దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుస‌రిస్తున్న‌ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల‌కు మేం వ్యతిరేకం అని కార్మికవర్గం చాటిచెప్పింది. నేడు దేశవ్యాపితంగా అఖిల‌భారత సమ్మెలో విశాఖనగర కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేసింది.

‘లాజిస్టిక్‌ హాబ్‌ ’ భూ సేకరణ సాగుదార్ల సమస్యు పరిష్కరించాలి.

     ఈ రోజు సిపియం పార్టీ నాయకులు లాజిస్టిక్‌ హబ్‌ భూ సాగుదార్లు, జిల్లా కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి నష్టపరిహారం విషయంలో సాగుదార్లుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యన్నారాయణ, గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి భూ సాగుదార్లు అందరికీ చట్టం ప్రకారం రావల్సిన పరిహారాన్ని, బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 

రైతులకు న్యాయం చేయాలి..

పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. కేబినెట్‌ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు.

సింగపూర్‌ షరతులు..!

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్‌ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం.

అసెంబ్లీ ముట్టడి:APరైతుసంగం

 రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.

Pages

Subscribe to RSS - September